బ్రహ్మపుత్రా నది
బ్రహ్మపుత్ర (Brahmaputra river) (అస్సామీ భాష: ব্ৰহ্মপুত্ৰ, బెంగాలీ భాష: ব্রহ্মপুত্র} హిందీ భాష: ब्रम्हपुत्र, టిబెటన్ భాషཡར་ཀླུངས་གཙང་པོ་ yar klung gtsang, Yarlung Tsangpo) ఆసియాలోని ముఖ్యమైన నదులలో ఒకటి. భారతదేశం, బంగ్లాదేశ్లలో నదులకు సహజంగా స్త్రీ నామం ఉండగా 'బ్రహ్మపుత్ర' పురుషనామంతో పిలువబడడం విశేషం.
టిబెట్లో నైఋతిన యార్లుంగ్ (Imperial blood) నది గా పుట్టి, దక్షిణ టిబెట్ లో దిహాంగ్ నదిగా పారి, హిమాలయాలలోని లోతైన లోయలలోకి పరుగులు తీస్తుంది. నైఋతిలో అస్సాంలో ప్రవహించి, దక్షిణాన బంగ్లాదేశ్ లో జమునగా పారుతుంది. అక్కడా గంగా నదితో కూడి పెద్ద డెల్టాను ఏర్పరుస్తుంది. సుమారు 2900 కిలోమీటర్లు (1800 మైళ్ళు) పొడవున్న ఈ నది వ్యవసాయానికి జల మార్గాలకు ఉపయోగకరంగా ఉన్నది. దీని ఎగువ పారుదల ప్రాంతం చాలా రోజుల వరకు గుప్తంగా ఉన్నది. దీనికి జాంగ్ బో పెనులోయతో గల సంబంధం 1884-86 అన్వేషణ వల్లనే కనుగొనబడినది.
ఈ నది దిగువ ప్రాంతము హిందువులకు పవిత్రమైనది. ఈ నది మెరుపు వరదలకు ప్రసిద్ధి. సాధారణంగా అలలు కేవలం సముద్రంలలోనే వస్తాయి. కానీ ప్రపంచంలో టైడల్ బోర్ (అలలపోటు)ను ప్రదర్శించే అరుదైన నదులలో ఇది ఒకటి.
బ్రహ్మపుత్ర యొక్క పురాణ సంస్కృత నామం లౌహిత్య. దీనినుండే అస్సాంలో ఈ నదిని పిలిచే పేరు లుయిత్ వ్యుత్పత్తి చెందింది. స్థానికంగా అక్కడ నివసించే బోడో లు ఈ నదిని భుల్లం - బుతుర్, అని పిలుస్తారు. అంటే బోడో భాషలో 'గర గర శబ్ధం చేసేది' అని అర్ధం. దీన్నే బ్రహ్మపుత్ర అని సంస్కృతీకరించారు.
బంగ్లాదేశ్ లో, బ్రహ్మపుత్ర రెండు పాయలుగా విడిపోతుంది. పెద్ద పాయ దక్షిణ దిశగా జమునగా సాగి దిగువ గంగలో కలుస్తుంది, ప్రాంతీయులు దీనిని పద్మా నది అంటారు. వేరొక పాయ దిగువ బ్రహ్మపుత్రగా పారి మేఘ్నా నదిలో కలుస్తుంది. ఈ రెండు పాయలు చివరకు బంగ్లాదేశ్లోని చాంద్ పూర్ అనే ప్రదేశంలో కలిసి బంగాళా ఖాతంలోకి సాగిపోతాయి. ఈ ప్రదేశంలో గంగ, బ్రహ్మపుత్ర నదీ జలాలు గంగ - బ్రహ్మపుత్ర డెల్టా ని ఏర్పరుస్తుంది. ఈ నది డెల్టా ప్రపంచంలోనే అతి పెద్దదైనది.
టిబెట్లో నైఋతిన యార్లుంగ్ (Imperial blood) నది గా పుట్టి, దక్షిణ టిబెట్ లో దిహాంగ్ నదిగా పారి, హిమాలయాలలోని లోతైన లోయలలోకి పరుగులు తీస్తుంది. నైఋతిలో అస్సాంలో ప్రవహించి, దక్షిణాన బంగ్లాదేశ్ లో జమునగా పారుతుంది. అక్కడా గంగా నదితో కూడి పెద్ద డెల్టాను ఏర్పరుస్తుంది. సుమారు 2900 కిలోమీటర్లు (1800 మైళ్ళు) పొడవున్న ఈ నది వ్యవసాయానికి జల మార్గాలకు ఉపయోగకరంగా ఉన్నది. దీని ఎగువ పారుదల ప్రాంతం చాలా రోజుల వరకు గుప్తంగా ఉన్నది. దీనికి జాంగ్ బో పెనులోయతో గల సంబంధం 1884-86 అన్వేషణ వల్లనే కనుగొనబడినది.
ఈ నది దిగువ ప్రాంతము హిందువులకు పవిత్రమైనది. ఈ నది మెరుపు వరదలకు ప్రసిద్ధి. సాధారణంగా అలలు కేవలం సముద్రంలలోనే వస్తాయి. కానీ ప్రపంచంలో టైడల్ బోర్ (అలలపోటు)ను ప్రదర్శించే అరుదైన నదులలో ఇది ఒకటి.
విషయ సూచిక[దాచు] |
[మార్చు] నదీ ప్రవాహ మార్గం
[మార్చు] టిబెట్లో
ఉత్తర హిమాలయాలలోని కైలాస పర్వతం [1] దగ్గర జిమా యాంగ్ జాంగ్ హిమానీనదం[2] లో పుట్టింది యార్లుంగ్ త్సాంగ్ పో నది. అక్కడి నుండి తూర్పు దిశగా సుమారు 1700 కిలో మీటర్లు, 4000 మీటర్ల ఎత్తున, ప్రయాణిస్తుంది. ఈ నది ప్రపంచంలోనే అన్ని నదులకన్నా ఎత్తుగా ప్రవహిస్తుంది. ఆ తర్వాత నంచా బార్వ పర్వతాన్ని చుడుతూ యార్లుంగ్ త్సాంగ్ పో పెనులోయ ను ఏర్పరుస్తుంది. ఈ పెనులోయ ప్రపంచంలోనే అత్యధిక లోతైనదిగా గుర్తించబడినది. [3][మార్చు] భారతదేశంలో
అరుణాచల్ ప్రదేశ్లో నది ప్రవేశించిన చోట ఈ నది పేరు సియాంగ్ అక్కడ చాలా ఎత్తు నుంచి చాల వేగంగా కిందికి దిగుతుంది. పర్వత పాద ప్రాంతంలో ఈ నదిని దిహంగ్ అంటారు. అక్కడ నుండి 35 కిలోమీటర్లు ప్రవహించాక దిబంగ్, లోహిత్ అనే మరో రెండు నదులతో సమాగమం అవుతుంది. ఈ సంగమ కేంద్రం నుండి ఈ నది చాలా వెడల్పు అవుతుంది, ఇక్కడ నుండి ఈ నది బ్రహ్మపుత్రగా పేరొందింది. సియాంగ్, దిబంగ్, లోహిత్ నదులు జల విద్యుదుత్పత్తికి ఎంతో అనుకూలమైనవి. భారత ప్రభుత్వం వీటి మీద ఆనకట్టలు కట్టడానికి కృషి చేస్తోంది. అస్సాంలో ఈ నది వెడల్పు కొన్ని చోట్ల 10 కిలోమీటర్లు దాకా ఉంటుంది. జోర్హాత్ కి దగ్గరలో రెండు పాయలుగా విడిపోయి 100 కిలోమీటర్ల దిగువన కలవడం ద్వారా ఈ నది మజూలి అనే ద్వీపాన్ని ఎర్పరుస్తోంది. మజూలి ప్రపంచంలోనే అతి పెద్దదైన నదీ ద్వీపం. గౌహతి దగ్గర్లో హజో అనే గ్రామం దగ్గర షిల్లాంగ్ పీఠభూమిని కోసుకుంటూ ప్రవహించడంవల్ల నది వెడల్పు చాలా సన్నగా మారుతుంది. ఎన్నో శత్రు దాడులను ఎదుర్కోవడానికి ఈ విశాలమైన నది అస్సాంకి అండగా ఉండేది. నది సన్నబడ్డ ప్రాంతం దగ్గరే సరాయ్ ఘాట్ యుద్ధము జరిగింది. ఇక్కడ నదిపై నిర్మించిన రైలు రోడ్డు వంతెనకు సరాయ్ ఘాట్ వంతెన అని పేరు పెట్టారు. మజొలి ద్వీపం ఈ నది మధ్య లొ కలదు.ఇది జొర్హట్ కు సమీపం లొ కలదు.బ్రహ్మపుత్ర యొక్క పురాణ సంస్కృత నామం లౌహిత్య. దీనినుండే అస్సాంలో ఈ నదిని పిలిచే పేరు లుయిత్ వ్యుత్పత్తి చెందింది. స్థానికంగా అక్కడ నివసించే బోడో లు ఈ నదిని భుల్లం - బుతుర్, అని పిలుస్తారు. అంటే బోడో భాషలో 'గర గర శబ్ధం చేసేది' అని అర్ధం. దీన్నే బ్రహ్మపుత్ర అని సంస్కృతీకరించారు.
No comments:
Post a Comment